Saturday, May 4, 2024

గానకోకిల సుశీలకు ఘన సత్కారం

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్, ఆర్యవైశ్యుల పెన్నిధి స్వర్గీయ డాక్టర్ కొణిజేటి రోశయ్య 90వ జయంతిని పురస్కరించుకుని సోమవారం రాత్రి హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘ‌నంగా జ‌రిగాయి. వాసవి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో స్వర నీరాజనం, ప్రముఖ గాయని పీ.సుశీల, వాసవి సత్ర సముదాయం అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు సతీసమేతంగా పాల్గొన్నారు.

జీవన సాఫల్య పురస్కార ప్రదాన మహోత్సవంలో ప్రముఖ నేపధ్య గాయని పీ.సుశీలను దేవకి వెంకటేశ్వర్లు దంపతులు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దేవకి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రోశయ్య బ‌తికి ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా జ్ఞాపికను అందుకున్న వారు, ఆయన మరణించాక ఆయన పేరు మీద జ్ఞాపకం అందుకోవటం ఒక గొప్ప విషయమని అన్నారు. అలాంటి అజాతశత్రువు మన మధ్య లేకపోవడం మనందరికి తీరని లోటు అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement