Tuesday, April 30, 2024

Delhi liquor Scam : లొంగిపోయిన మాగుంట రాఘవ

ఢిల్లీ మద్యం కేసులో తాత్కాలిక బెయిల్ పై ఉన్న మాగుంట రాఘవ ఢిల్లీలోని తిహార్ జైలు వద్ద ఈడీ అధికారుల ముందు లొంగిపోయాడు. త‌న అమ్మ‌మ్మ‌కు ఆరోగ్యం స‌రిగా లేనందున త‌న‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వ‌వ‌ల‌సిందిగా రాఘవకు తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు.. దీంతో ఆయ‌న‌కు 2 వారాల మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది.

అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ.. ఈడీ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ పరిమితి కుదించి లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మాగుంట రాఘవ ఈడీ అధికారులకు లొంగిపోయాడు. ప్ర‌స్తుతం రాఘ‌వ జ్యుడిషియ‌ల్ రిమాండ్ లో కొన‌సాగుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement