Thursday, July 25, 2024

WPL | గుజరాత్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం!

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండ‌వ‌ సీజన్‌లో గుజరాత్ జెయింట్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవ్వాల (ఆదివారం) జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మూడో విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌.. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (55) హాఫ్ సెంచరీతో రాణించగా.. అలీస్‌ క్యాప్సీ (27) దూకుడుగా ఆడింది. గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో మేఘన సింగ్(4) నాలుగు వికెట్లు తీయగా.. అశ్లే గార్డ్‌నర్(2) రెండు వికెట్లు పడగొట్టాడు. మన్నత్ కశ్యప్, తనూజ కన్వర్ చ‌రో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్నీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులే చేసి ఓటమిపాలైంది. అశ్లే గార్డ్‌నర్ (40) ఒక్కతే రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమైంది. జెస్స్ జోనాస్సెన్(3), రాధా యాదవ్(3) మూడేసి వికెట్లు తీయగా.. శిఖా పాండే, అరుంధతి రెడ్డి తలో వికెట్ తీసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement