Saturday, July 27, 2024

Electric vehicles | ఈవీల జోరు.. కీలక ఖనిజాలకు డిమాండ్‌ !

ఎలక్ట్రిక్‌ కార్లు, పవన విద్యుత్‌ పరిశ్రమల విస్తరణ కారణంగా దక్షిణ కొరియాలో కీలకమైన ఖనిజాల డిమాండ్‌ 2021 నుండి 2040కి 19 రెట్లు పెరుగుతుందని ఆదివారం ఒక నివేదిక వెల్లడించింది. కొరియా ఎనర్జీ ఎకనామిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కెఇఇఐ) నివేదిక ప్రకారం ఎలక్ట్రిక్‌ కోసం అవసరమైన లిథియం, నికెల్‌, మాంగనీస్‌, కోబాల్ట్‌కు భారీ డిమాండ్‌ ఉంటుందని పేర్కొంది. కార్‌ బ్యాటరీల తయారీలో వీటి డిమాండ్‌ 2021 నాటికి 2040 నాటికి వరుసగా 15రెట్లు, 12 రెట్లు, 19 రెట్లు, 4 రెట్లు పెరుగనున్నట్లు తెలిపింది.

ఇదే కాలంలో దక్షిణ కొరియాలో ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాలు 11రెట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్‌ కార్‌ మోటార్‌లకు అవసరమైన నియోడైమియం, ప్రాసియోడైమియం, డిస్ప్రోసియం, టెర్బియమ్‌లకు డిమాండ్‌ 10 రెట్లు పెరుగుతుంది. 2022 నుండి 2040 నాటికి కొత్త విడతల పవన విద్యుత్‌ సౌకర్యాలు ఎనిమిది రెట్లు పెరిగే అవకాశం ఉందని నివేదిక చూపించింది. నియోడైమియం, ప్రసోడైమియం, డిస్ప్రోసియం, టెర్బియం వంటి సంబంధిత పదార్థాలకు డిమాండ్‌ వరుసగా 2.6 రెట్లు, 3.1 రెట్లు, 21.6 రెట్లు , 2.7 రెట్లు పెరుగుతుందని నివేదించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement