Wednesday, May 1, 2024

AP | 4నుంచి విశాఖ-పలాస పాసింజర్‌ రైలు పొడిగింపు

అమరావతి, ఆంధ్రప్రభ : ఉత్తరాంధ్ర ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ -పలాస- విశాఖ (08532/8531) ప్రత్యేక పాసింజర్‌ రైలును బ్రహ్మపుర వరకు పొడిగించినట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. విశాఖ -బ్రహ్మపుర (08532) పాసింజర్‌ రైలు ఈనెల 3వ తేదీ నుంచి ప్రతి రోజు సాయంత్రం 5.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి రాత్రి 11.10 గంటలకు బ్రహ్మపుర చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో బ్రహ్మపుర- విశాఖ (08531) పాసింజర్‌ ఈనెల 4వ తేదీ నుంచి ప్రతిరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు బ్రహ్మపురలో బయలుదేరి ఉదయం 9.20 గంటలకు విశాఖ చేరుకుంటుందని పేర్కొన్నారు. కాగా ఈ రైలు 14 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ బోగీలు, 2 సెకండ్‌ క్లాస్‌ దివ్యాంగజన్‌ బోగీలతో నడుస్తుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement