Thursday, May 2, 2024

డ్రయిన్‌లో లా స్టూడెంట్‌ శవం.. పోలీసు వలలో నిందితులు..

మీరట్‌: గోనె సంచులలో చుట్టి ఉన్న ఎల్‌ఎల్‌బి విద్యార్థి మృత దేహాన్ని ఢిల్లిలోని సాదిక్‌ నగర్‌లోని డ్రయిన్‌ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధమున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యశ్‌ రస్తోగి అనే 22 ఏళ్ల వ్యక్తి జూన్‌ 26 నుంచి కనిపించకుండా పోయాడు. మృత దేహాన్ని వెలికి తీసిన తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ సిటీ వినీత్‌ భట్నాగర్‌ మాట్లాడుతూ ఈ కేసులో అలీషాన్‌, సలీం, షావెజ్‌ అనే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

మరణించిన యశ్‌తో ఈ ముగ్గురు నిందితులు హోమో సెక్స్‌ సంబంధం కొనసాగించారని చెప్పారు. అయితే ఈ ముగ్గురు నిందితులను యశ్‌ బ్లాక్‌ మెయిల్‌ చేసినట్టు ఆధారాలు లభ్యమయ్యాయని ఎస్పీ వివరించారు. యశ్‌ తన వద్ద ఉన్న ఛాయాచిత్రాలను చూపిస్తూ రూ 40వేలు వసూలు చేశాడని మరికొంత నగదు ఇవ్వాలని యశ్‌ చేయడమే హత్యకు దారి తీసిందని ఎ స్పీ చెప్పాడు. బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్‌ 26న సాయంత్రం నాలుగు గంటల సమయంలో యశ్‌ తన స్కూటీపై ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement