Friday, April 26, 2024

చిక్కుల్లో బీజేపీ.. రాఫెల్ కొనుగోలులో స్కాం?

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో స్కాం జరిగినట్లు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ డీల్‌లో భారత్‌కు చెందిన మధ్యవర్తికి భారీగా ముడుపులు ముట్టినట్లు ఫ్రెంచ్ యాంటీ కరప్షన్ ఏజెన్సీ ‘మీడియా పార్ట్’ బయటపెట్టింది. మధ్యవర్తికి దాదాపు రూ.9 కోట్లను గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ఫ్రెంచ్ సంస్థ డెసాల్ట్ గ్రూప్ అంగీకరించినట్లు సమాచారం. 2016లో భారత్-ఫ్రాన్స్ మధ్య ఈ డీల్ కుదిరింది. ఇక మధ్యవర్తికి రూ.4.12కోట్లు (508,925 యూరోలు) చెల్లించి, గిఫ్ట్ కింద అకౌంట్స్‌లో డెసాల్ట్ గ్రూప్ సంస్థ రాసుకుంది. 2018లో ఆ సంస్థలో జరిగిన ఆడిటింగ్ సమయంలో ఈ విషయం బయటపడింది. అయితే మిగతా డబ్బులు ఇంకా చెల్లించాల్సి ఉందట. ఇదొక ఆర్థిక నేరమని ‘మీడియా పార్ట్’ సంస్థ అభిప్రాయపడింది. అయితే రాఫెల్ డీల్‌లో ఎలాంటి స్కాం జరగలేదని గతంలో సుప్రీం కోర్టు స్పష్టం చేయగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ తాజా వ్యవహారంపై ఇప్పటి వరకు స్పందించలేదు.

ఈ వివాదాస్ప‌ద ఇండో-ఫ్రెంచ్ రాఫెల్ డీల్‌పై మూడంచెల విచార‌ణ కొన‌సాగుతుంద‌ని ఫ్రెంచ్ అవినీతి నిరోధ‌క విభాగం ప్ర‌క‌టించింది. మొద‌ట 36 రాఫెల్ యుద్ధ విమానాల‌ను కొనుగోలు చేసేందుకు భార‌త్ 7.8 బిలియ‌న్లు ఖ‌ర్చు చేసేందుకు అంగీకరించింది. అందులో కొన్ని విమానాలు ఇప్ప‌టికే భార‌త్ చేరాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement