Sunday, March 24, 2024

జగ్జీవన్‌రామ్‌ జయంతి

సుల్తానాబాద్‌: డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ గారి 112 వ జయంతిని పట్టణంలోని 6వ వార్డు కౌన్సిలర్‌ వర ప్రదీప్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ్థసర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఈకార్యక్రమంలో నాయకులు చింతల రాజు, కుమార్‌, శంకర్‌, శ్యామ్‌, కిరణ్‌, హేమన్‌ రాజ్‌, రాహుల్‌, ప్రణీత్‌, రాజు, వసంత్‌, ప్రేమ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement