Sunday, May 5, 2024

బాసర సరస్వతి ఆలయంలో దర్శనాలు ప్రారంభం

తెలంగాణ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‎డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్‎డౌన్ కారణంగా నిర్మల్ బాసర సరస్వతీ క్షేత్రంలో దర్శనాలు నిలిపివేశారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుండి లాక్‎డౌన్ ఎత్తివేస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. దీంతో బాసర సరస్వతి ఆలయంలో దర్శనాలు, ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనం చేసుకోవాలని ఆలయ ఈవో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement