తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా, దామరగిద్ద తహసీల్దార్ వెంకటేశ్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. రూ.5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో ఏసీబీ అధికారులు దామెరగిద్ద తహసీల్దార్ కార్యాలయంలో దాడులు చేస్తున్నారు. తహసీల్దార్ వెంకటేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది