ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టులో నిన్న ఉపసంహరించుకున్నారు. అందుకు అనుమతినిచ్చిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది. దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ తరుపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది పీవీ కపూర్ వానదలు వినిపించారు. పిటిషన్ను ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. సిబిఐ తన ఛార్జిషీట్లో కొన్ని సంబంధం లేని అంశాలను పేర్కొందని చెప్పారు. జగన్ సంస్థల్లోకి పునీత్ ద్వారా కొంత అక్రమ సొమ్ము చేరిందని సీబీఐ ఆరోపణలో వాస్తవం లేదన్నారు. వాదనల అనంతరం న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement