Friday, April 26, 2024

సైబ‌ర్ నేర‌గాళ్ల చేతిలో ఐసీసీ.. రూ.20కోట్లకి కుచ్చు టోపీ

అంత‌ర్జాతీయ క్రికెట్ సమాఖ్య ఐసీసీకి కుచ్చు టోపీ పెట్టారు సైబ‌ర్ నేర‌గాళ్లు. ఏకంగా రూ.20 కోట్లపైగా కాజేశారు. అమెరికా నుంచి గతేడాది ఈ స్కామ్ జరిగినట్టు సమాచారం. దీనిపై ఐసీసీ ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. అంతర్గత విచారణ చేపట్టింది. బిజినెస్ ఈ–మెయిల్ (బీఈసీ) అనే పద్ధతి ద్వారా ఈ మోసం జరిగింది. ఆర్థికంగా ఎంతో బలమైన, పటిష్ఠ వ్యవస్థ కలిగిన ఐసీసీ మోసపోవడం చర్చనీయాంశమైంది. ఐసీసీకి చెందిన కన్సల్టెంట్‌ అంటూ ఈ సంస్థ నుంచి సొమ్మును కాజేసినట్లు సమాచారం. కొన్ని కొనుగోళ్ల విషయమై అమెరికాకు చెందిన ఓ సంస్థకు ఐసీసీ చెల్లింపులు చేసింది. కానీ, అది తప్పుడు సంస్థ అని తెలిసి షాక్ కు గురైంది. ఐసీసీ కన్సల్టెంట్ ఈమెయిల్ ఐడీని పోలిన ఓ ఐడీతో మోసగాళ్లు ఈ తతంగం నడిపించారు. దాంతో, ఐసీసీ గుడ్డిగా నమ్మి చెల్లింపులు జరిపింది. ఏకంగా మూడుసార్లు చెల్లింపులు జరిపి 2.5 మిలియన్ డాలర్లు మోసపోయింది. విదేశాల్లో బిజినెస్ ఈ–మెయిల్ (బీఈసీ) మోసాలు ఈ మధ్య తరచూ జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement