Thursday, May 16, 2024

C-tet Notificaton | సీటెట్‌ నోటిఫికేషన్‌ విడుదల… నవంబర్ 23 వ‌ర‌కు దరఖాస్తులు

అమరావతి, ఆంధ్రప్రభ:ఉపాధ్యాయవృత్తిని కెరీర్‌గా నిర్ణయించుకుని సిన్నద్ధమవుతున్న అభ్యర్థులకు కొరకు అధికారులు సీటెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిడిఎస్‌ఈ) ప్రతీ ఏటా సెంట్రల్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీటెట్‌ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా జనవరి – 2024 ఏడాదికి సంబంధించిన సీటెట్‌ (సీటెట్‌ 2024) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ సీటెట్‌ 2024 రిజిస్ట్రేష్రన్ల ప్రక్రియ నవంబర్‌ 3 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి, ఫీజు చెల్లించడానికి నవంబర్‌ 23 వరకు గడువు ఇచ్చారు.

సీటెట్‌ పరీక్షను 2024 జనవరి 21వ తేదీన కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించనున్నారు. అభ్యర్ధులు http://ctet.in.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. సీటెట్‌ పరీక్ష మొత్తం రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్‌ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారి కోసం, రెండో పేపర్‌ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్‌ స్కోర్‌ లైఫ్‌ లాంగ్‌ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్‌ స్కోర్‌ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని స్కూల్స్‌ ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.

విద్యార్హతలు:

పేపర్‌-1: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా(డీఈఎల్‌ఈడీ)/డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
పేపర్‌-2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌/బ్యాచిలర్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ)/ బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) లేదా సీనియర్‌ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (బీఈఎల్‌ఈడీ)/బీఎస్సీఈడీ/బీఏఈడీ/బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్‌, ఓబీసీ కి చెందిన వారు దరఖాస్తు రుసుము రూ.1000 (పేపర్‌ 1 లేదా 2 మాత్రమే), పేపర్‌ 1, 2 రెండూ రాయచదలిచేవారు రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500 (పేపర్‌ 1 లేదా 2 మాత్రమే), పేపర్‌ 1, 2 రెండూ రాయదలచిన వారు రూ.600 చెల్లించాలి. తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లోపరీక్ష కేంద్రాలు పరీక్ష నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement