Sunday, May 5, 2024

తెలంగాణలో లాక్ డౌన్….ఫేక్ జీవో

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారంటూ ఒక జీవో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాయంత్రం ఆరు గంటల నుంచి తర్వాత రోజు ఉదయం ఎనిమిది గంటల వరకూ షాపులు మూసి ఉంచాలని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జీవోలో స్పష్టంగా ఉంది. అయితే దీనిపై సి ఎస్ సోమేశ్ కుమార్ స్పందించారు.

తెలంగాణలో ఎలాంటి లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల పేరుతో వస్తున్న వార్తలను నమ్మవద్దని స్పష్టం చేశారు. నా పేరు తో జివో ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమని సోమేష్ కుమార్ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement