Friday, May 3, 2024

నో బాల్ ఇచ్చిన అంపైర్ హ‌త్య‌…

భువనేశ్వర్‌: ‘నో బాల్‌’ సిగ్నల్‌ ఇచ్చినందుకు అంపైర్‌ను కొట్టి కత్తితో పొడిచి చంపారు. ఒడిశాలోని కటక్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చౌద్వార్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మన్హిసలంద గ్రామంలో శనివారం శంకర్‌పూర్‌, బెర్హంపూర్‌కు చెందిన అండర్-18 క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మహిలాంద ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల లక్కీ రౌత్‌, అంపైర్‌గా వ్యవహరించాడు. అయితే మ్యాచ్‌ సందర్భంగా ఒకరు బౌలింగ్‌ చేయగా అంపైర్‌గా ఉన్న లక్కీ రౌత్‌ ‘నో బాల్‌’ సిగ్నల్‌ ఇచ్చాడు. దీంతో ఇది గొడవకు దారి తీసింది.

ఈ నేపథ్యంలో అంపైర్‌ లక్కీ రౌత్, ప్లేయర్‌ జగ్‌ రౌత్‌ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో జగ్‌ రౌత్‌ తన సోదరుడు మునా రౌత్‌ను పిలిపించాడు. అక్కడకు వచ్చిన అతడు ఆగ్రహంతో లక్కీ రౌత్‌ను కొట్టాడు. ‘నో బాల్‌’ సిగ్నల్‌ ఇచ్చిన ఆ అంపైర్‌ను కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయ‌ప‌డిన అత‌డు చికిత్స కోసం హాస్ప‌ట‌ల్ కి త‌ర‌లిస్తుండగానే మ‌ర‌ణించాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జ‌గ్ రౌత్, మునా రౌత్ ల‌ను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement