Monday, April 29, 2024

జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఆ లేఖ లో ఏపీఎస్ఆర్టీసీకి ఉన్న ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులుగా మార్పుచేసి ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలని రామకృష్ణ అన్నారు. కరోనా సెకండ్ వేవ్ లో దాదాపు 12 వేల మంది ఆర్టీసీ సిబ్బందికి కరోనా సోకగా, 160 మంది మృత్యువాతపడ్డారు.

విజయవాడ, కడపలలో 50 పడకల సామర్థ్యంతో ఆర్టీసీకి ఉన్న ఆసుపత్రులను వినియోగంలోకి తీసుకురండని అన్నారు రామకృష్ణ. ఈ హెచ్ ఎస్ కార్డులున్నప్పటికీ బయట ఆసుపత్రులలో బెడ్ లు లభించకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారని రామకృష్ణ లేఖ లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement