Friday, May 3, 2024

29 నుంచి అగ్రికల్చర్‌ డిప్లొమా కోర్సులకు కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈనెల 29 నుండి సెప్టెంబర్‌ 3 వరకు పాలిటెక్నిక్‌, డిప్లొమా కోర్సులకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పాలిటెక్నిక్‌, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో రెండేళ్లు, మూడేళ్ల వ్యవసాయ డిప్లొమా కోర్సులకు సంబంధించి ఈ విద్యాసంవత్సరానికి ప్రవేశాలను నిర్వహిస్తున్నారు. పాలిసెట్‌-2022 ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు. మెరిట్‌ లిస్టు, కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌, ఇతర వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు షెడ్యూల్‌ను చూసి వారి ర్యాంకుల ప్రకారం కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని రిజిస్ట్రార్‌ డా.ఎస్‌.సుధీర్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement