Tuesday, May 7, 2024

ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నో తెలుసా?

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 31,809 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,271 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 285 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 279, విశాఖ జిల్లాలో 189, కృష్ణా జిల్లాలో 161, కడప జిల్లాలో 63, ప్రకాశం జిల్లాలో 63, అనంతపురం జిల్లాలో 61, కర్నూలు జిల్లాలో 52, నెల్లూరు జిల్లాలో 43, తూ.గో. జిల్లాలో 27, శ్రీకాకుళం జిల్లాలో 21, విజయనగరం జిల్లాలో 15, ప.గో. జిల్లాలో 12 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 464 మంది కరోనా నుంచి కోలుకోగా అనంతపురం, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 9,03,260 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,87,898 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 8,142గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,220గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement