Monday, April 29, 2024

ప్రమాదకరస్థాయిలో కరోనా.. తాజాగా 562 కొత్త కేసులు నమోదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కరోనా మహమ్మారి మరోసారి ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా562 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకోవడంతో 616 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 5112కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 27, 249 మందికి కరోనా టెస్టులు చేశారు.

తాజా కేసుల్లో 329 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదు కాగా… ఖమ్మం జిల్లాలో 14, కరీంనగర్‌ 10, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 52, రంగారెడ్డిలో 60, సంగారెడ్డిలో 13 అత్యధిక కేసులు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement