Sunday, May 5, 2024

Delhi | అలజడి సృష్టించేందుకే కుట్ర.. బండిపై పీడీ యాక్ట్ పెట్టాలి: ఎంపీ బడుగుల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పదో తరగతి పేపర్ లీక్ అంశంతో తెలంగాణ సమాజంలో అలజడి సృష్టించాలని కుట్రలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హిందీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో ప్రశాంత్ బీజేపీ కార్యకర్త అని, బండి సంజయ్ అనుచరుడని లింగయ్య యాదవ్ చెప్పుకొచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మీద కుట్రలు చేస్తున్నారని, తెలంగాణను అప్రతిష్టపాలు చేస్తున్నారని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని సిట్‌తో దర్యాప్తు చేస్తోందని విమర్శించారు. కొన్నాళ్ళు రైతులు, ఆ తర్వాత ఉద్యోగార్థులు, ఇప్పుడు విద్యార్థులను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తోందని లింగయ్య యాదవ్ ధ్వజమెత్తారు. బండి సంజయ్ వంటి వారిని పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి నిజాలు రాబట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement