Tuesday, April 30, 2024

అంబేద్కర్ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయరు?: వీహెచ్

హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. కల్నల్ సంతోష్ కుమార్ విగ్రహం ఏర్పాటు తమకు కూడా హర్షణీయమేనని, కానీ అంబేద్కర్ ఏం పాపం చేశారని తెలంగాణ ప్రభుత్వాన్ని వీహెచ్ ప్రశ్నించారు. 2019లో జై భీమ్ కార్యకర్తలు పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం నెలకొల్పే ప్రయత్నం చేయగా, మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారని వివరించారు. మరోసారి విగ్రహం ఏర్పాటుకు తాము ప్రయత్నిస్తే గోషామహల్ పోలీస్ స్టేషన్ లో పెట్టారని వీహెచ్ ఆరోపించారు.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్-3 వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం కోసం సమైక్య పోరాటం చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే తాను ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, అసదుద్దీన్ ఒవైసీ, ఎల్.రమణ, చాడ వెంకట్ రెడ్డిలతో ఈ విషయమై చర్చించానని, దీనిపై ఎల్లుండి రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుందని వీహెచ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement