Thursday, April 25, 2024

కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత

మహారాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ స‌తవ్ కరోనాతో క‌న్నుమూశారు. ఏప్రిల్ 22న క‌రోనా బారిన ప‌డిన ఆయ‌న పుణెలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజుల క్రితం క‌రోనా నుంచి కోలుకున్నారు. కానీ ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఉదయం ఆదివారం ఆరోగ్యం విష‌మించ‌డంతో చ‌నిపోయారు.

రాజీవ్ మ‌ర‌ణ వార్త తెలుసుకున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. త‌న‌ స్నేహితుడిని కోల్పోయినందుకు చాలా బాధ‌గా ఉంద‌న్నారు. కాంగ్రెస్ ఆద‌ర్శాల‌కు రాజీవ్ స‌త‌వ్ నిద‌ర్శ‌న‌మ‌ని కొనియాడారు. గొప్ప సామర్థ్యం ఉన్న నాయ‌కుడ్ని కోల్పోవ‌డం పార్టీకి భారీ న‌ష్ట‌మేన‌ని చెప్పారు. ఆయ‌న కుటుంబానికి రాహుల్ గాంధీ ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు‌. కాగా రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా రాజీవ్ సతవ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement