Friday, April 26, 2024

గుంటూరుకి చేరుకున్న ఆక్సిజ‌న్ ఎక్స్ ప్రెస్…

గుంటూరు: ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ఆదివారం న్యూ గుంటూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. రైలులో నాలుగు ట్యాంకర్లు వచ్చాయి. 78 టన్నుల ఆక్సిజన్ వచ్చింది. అధికారులు ఆక్సిజన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. రాష్ట్రానికి 910 టన్నుల ఆక్సిజన్ అవసరమని సీఎం జగన్ కేంద్రానికి ఇప్పటికే లేఖ రాశారు. దీంతో ఈ మేరకు ఆక్సిజన్ వచ్చింది. ట్యాంకర్ల పంపిణీ పర్యవేక్షణ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement