Monday, May 6, 2024

కామ‌న్వెల్త్ గేమ్స్‌.. మహిళా క్రికెటర్లకు సోకిన కరోనా

కామన్వెల్త్‌ గేమ్స్‌ల్లో పాల్గొనే భారత మహిళా క్రికెట్‌ జట్టులో ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఎస్‌.మేఘనతోపాటు ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌ కొవిడ్‌ బారిన పడినట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ధ్రువీకరించారు.

కరోనా బారిన పడ్డ ప్లేయర్లు ఇద్దరూ భారత్‌లోనే ఉండిపోగా, మిగిలిన జట్టు సభ్యులంతా ఇప్పటికే కామన్వెల్త్‌ గేమ్స్‌ కోసం బర్మింగ్‌హోమ్‌ చేరారు. జులై 29న ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్న భారత మహిళా క్రికెటర్లు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఇంగ్లండ్‌ బయలుదేరి జట్టుతో కలుస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement