Wednesday, April 24, 2024

క‌రోనా ఎఫెక్ట్‌.. వెస్టిండీస్‌తో జ‌రిగే టీ20 సిరీస్‌కు రాహుల్‌ దూరం

కరోనా బారినపడ్డ కేఎల్‌ రాహుల్‌ ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి వెస్టిండీస్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లో ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. జులై 21న అస్వస్థత గురికావడంతో పరీక్షలు చేయించుకోగా, కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

అప్పటి నుంచి ఐసొలేషన్‌లో ఉన్నాడు. తాజాగా కేఎల్‌ రాహుల్‌ను పరీక్షించిన వైద్యులు మరో వారం రోజులు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమైనట్లే. అయితే ఈ విషయం బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement