Thursday, May 2, 2024

Loksatta Chief: డెత్ స‌ర్టిఫికెట్స్ పైనా సీఎం ఫోటోలా.. జ‌య‌ప్ర‌కాష్

రాజకీయాలు, ఐఏఎస్‌లకు ఇటీవల గ్లామర్‌ను ఆపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఐఏఎస్ మాజీ అధికారి, లోక్‌సత్తా చీఫ్ జయప్రకాశ్ నారాయణ. ప్రచార పిచ్చి పతాకస్థాయికి చేరిందని, లేకపోతే మరణ ధ్రువీకరణ పత్రంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో ఏంటని ప్రశ్నించారు. హైద‌రాబాద్ లో ఇవాళ జ‌రిగిన ఒక చ‌ర్చ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ… పట్టాదారు పాసుపుస్తకాల్లోనూ, చివరికి సర్వే రాళ్లపైనా సీఎం ఫొటోలు వేస్తున్నారని, ఇంతకంటే దారుణం ఇంకెక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

న్యాయ వ్య‌వ‌స్థ‌లోనూ లోపాలు..

దురదృష్టవశాత్తు న్యాయవ్యవస్థ కూడా అంత ప్రభావవంతంగా పనిచేయడం లేదన్నారు జెపి. కోర్టు ఇటీవల ఓ తీర్పు చెబుతూ ప్రజల సొమ్ముతో ప్రచారం చేసుకుంటునప్పుడు ఎక్కడా ఫొటోలు కానీ, పేర్లు కానీ ఉండకూడదని చెప్పిందని కానీ, ప్రధాన మంత్రికి, ప్రధాన న్యాయమూర్తికి మినహాయింపు ఇచ్చిందని గుర్తు చేశారు. వారిద్దరికి మాత్రం మినహాయింపు ఎందుకని ప్రశ్నించారు. ఆ జడ్జిమెంటుతో ఒరిగిందేంటని నిలదీశారు. సమాజంలో జుగుప్సాకరమైన సంస్కృతి పెరిగిపోయిందని, లక్ష్యం కోసం పనిచేయడం కాకుండా ప్రతిదాంట్లో ‘నేను’ అనే అహం పెరిగిపోయిందని విచారం వ్యక్తం చేశారు. కుటుంబ పాలనపై ఇటీవల కొంత వ్యతిరేకత కనిపించడం శుభపరిణామమని జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement