Friday, April 26, 2024

18న ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రి పువ్వాడ‌..

ఈనెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. దీంతో భద్రత ఏర్పాట్లను పరిశీలించేందుకు మల్టీ జోన్ -I ఐజీపీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఖమ్మం నగరానికి చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో వీరిని పోలీస్ గెస్ట్ హౌస్ లో ఖ‌మ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుఛ్చం అంద‌జేశారు. అనంతరం రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం వద్ద నిర్మించిన నూతన సమీకృత కార్యాలయాల భవన సముదాయానికి చేరుకున్న ఐజీపీ, డీఐజీ పోలీస్ కమిషనర్ లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి పువ్వాడ, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తో కలసి వీవీపీల పర్యాటన, బహిరంగ సభ వేదిక ట్రాఫిక్, పార్కింగ్, హెలిప్యాడ్ ప్రాంతాలను సందర్శించి రూట్ మ్యాప్ పరిశీలించారు. భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులు చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement