Wednesday, March 27, 2024

బైక్ పై స్టంట్స్.. మూడు బైక్ లు సీజ్

బైక్ పై స్టంట్లు చేస్తూ వీరంగం సృష్టించారు ప‌లువురు యువ‌కులు. ఈ సంఘ‌ట‌న ఉత్తరప్రదేశ్‌ బరేలీలో చోటు చేసుకుంది. కాగా మూడు ద్విచక్రవాహనాలపై 14 మంది యువకులు ప్రమాదకరంగా ప్రయాణించారు. ఒక ద్విచక్రవాహనంపై ఏకంగా ఆరుగురు కూర్చుని స్టంట్లు చేశారు. మరో రెండు బైకులపై నలుగురు చెప్పున కూర్చున్నారు. వీరంతా దారిపొడవునా అరుస్తూ.. సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ కనిపించారు. ఈ ఘటనను దారిన పోయేవారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్తా వైరల్‌ అయ్యి.. పోలీసుల దృష్టికి చేరింది. వీడియోలు, ఫొటోల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకులను పట్టుకుని మూడు బైక్‌లను సీజ్‌ చేశారు. ఈ ఘటనపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సీనియర్‌ పోలీసు అధికారి అఖిలేష్‌ కుమార్ వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement