Monday, May 6, 2024

తెలంగాణలో స్కూళ్ల రీ ఓపెన్‌కు సర్కారు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ‌లో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలను రీ ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధనకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్టేటస్ రిపోర్ట్‌ను సీఎం కేసీఆర్‌కు పంపిన విద్యాశాఖ… తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని, విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని రిపోర్ట్ అందజేసింది.

ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలలో తరగతుల ప్రారంభంపైనా విద్యాశాఖ సీఎం దృష్టికి తీసుకువెళ్లింది. తమ చిన్నారుల పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదని విద్యాశాఖ సూచిస్తోంది. స్కూళ్లు తెరవమని ఇప్పటికే సూచించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ.. రేపు లేదా సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారుల సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన… 8వ త‌ర‌గ‌తి నుంచి పీజీ వ‌ర‌కు ప్రత్యక్ష క్లాసులు ప్రారంభించేందుకు శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. అలాగే సెప్టెంబ‌ర్ 1 నుంచి విద్యాసంస్థల్లో ప్రత్యక్ష క్లాసులు నిర్వహించాలని ప్రకటించే అవకాశాలున్నాయి.

ఈ వార్త కూడా చదవండి: రేవంత్‌రెడ్డికి తెలంగాణ సర్కారు షాక్

Advertisement

తాజా వార్తలు

Advertisement