Saturday, May 4, 2024

నోముల భగత్‌కు బి ఫాం అందజేసిన చేసిన కేసీఆర్

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నోముల భగత్‌కు సీఎం కేసీఆర్.. పార్టీ బీఫామ్ అందజేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో భగత్ కు బీ-ఫారం అందించిన కేసీఆర్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమలో నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులతో పాటు మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జానారెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించగా, బీజేపీ తరఫున కంకణాల నివేదితా రెడ్డి బరిలో దిగుతారని భావిస్తున్నారు. అయితే, ఉత్కంఠకు తెరదించుతూ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల కుమారుడు భగత్ ను ఎంపిక చేశారు. నోముల భగత్ రేపు నామినేషన్ దాఖలు చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement