Sunday, April 28, 2024

ఢిల్లీలో కొనసాగుతున్న కేసీఆర్ పర్యటన..

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. మొదట మూడు రోజుల పర్యటన అంటూ ఢిల్లీ బయల్దేరిన సీఎం.. ఇప్పుడు హస్తిన పర్యటనను పొడిగించారు.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన ఆయన.. ఇవాళ కూడా ఢిల్లీలోనే బస చేయనున్నారు.. రేపు మరికొన్ని భేటీలు జరగనున్నట్టు తెలుస్తోంది.. సోమవారం రోజు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలిసే అవకాశం ఉండగా.. రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ను కూడా కలిసి యాదాద్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన కేసీఆర్‌ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలంటూ కోరారు. ఢిల్లీలో టీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయం శంకుస్థాపన కోసం ఈ నెల 1వ తేదీన హస్తిన బాట పట్టిన ఆయన.. గత ఐదు రోజులుగా అక్కడే మకాం వేశారు.. సోమవారం మరికొన్ని భేటీ ఉన్నాయని తెలుస్తుండడంతో.. మరో రోజు ఆయన పర్యటన పొడిగించినట్టే.

ఇది కూడా చదవండి: ఈనెల 17న గజ్వేల్‌లో కాంగ్రెస్ దండోరా సభ

Advertisement

తాజా వార్తలు

Advertisement