Thursday, April 25, 2024

మరోసారి ప్రధాని మోడీతో భేటీ కానున్న.. సీఎం జగన్

మరోసారి ఢిల్లీకి వెళ్ల నున్నారు సీఎం జగన్. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల 30నిమిషాలకి ప్రధాని నరేంద్రమోడీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. కాగా రేపు సాయంత్రం ఆరు గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో జగన్ బయలు దేరనున్నారు. కాగా ఇప్పటికే పలుసార్లు ప్రధానితో భేటీ అయిన జగన్ ఈసారి భేటీపై ప్రాధాన్యత చోటు చేసుకుంది.ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతో పాటు ఇతర రాజకీయ అంశాలపై చర్చ జరగనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి.

ఇక విభజన హామీలు, అలాగే రాష్ట్రానికి సంబందించి కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్యా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వారి అపాయింట్ మెంట్స్ ప్రకారం కుదిరిన సమయంలో జగన్ పలువురితో భేటీ కానున్నారు. అయితే ఏపీకి సంబంధించిన కొన్ని అంశాలపై అటు ఆయా శాఖల కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని మోదీ తో భేటీ కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement