Monday, April 29, 2024

Breaking | అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. అడ్డుకునేందుకు వెళ్లిన యువకుడి మృతి

ఆదిలాబాద్​ జిల్లాలో ఘోరం జరిగింది. నేరడిగొండలో ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకుంటే విడిపించటానికి వెళ్లి.. తోపులాటలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు చనిపోయాడు. రాయిపై పడడంతో చనిపోయిన ఘటన నేరడిగొండ మండలం వడూర్ గ్రామంలో ఇవ్వాల (శనివారం) చోటుచేసుకుంది. గుండ్ల తనాజీ ఇద్దరు కొడుకుల మధ్య గొడవ జరుతుండగా అదే గ్రామానికి చెందిన కందుకూరి పెద్ద సోమన్న కుమారుడు కందుకూరి ప్రశాంత్ (20) ఇద్దరిని విడిపించేందుకు మధ్యలో వెళ్లాడు.

అన్నదమ్ముల తోపులాటలో ప్రశాంత్ పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మెపై పడ్డాడు. దాంతో తలకు తీవ్రంగా గాయలయ్యాయి. స్థానికులు వెంటనే డాక్టర్​ దగ్గరికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలోనే చనిపోయాడు. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement