Wednesday, May 1, 2024

ప్రారంభమైన చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంక్..

కరోనా కష్టకాలంలో నటుడు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభించారు. గ‌త కొద్ది రోజులుగా రామ్ చరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు శరవేగంగా జ‌రిగాయి. తాజాగా చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంక్స్ లాంచ్ కాగా, ఈ రోజు ఉదయం 10.30 నుంచి అనంతపూర్,గుంటూరు జిల్లా కేంద్రాలలో చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంక్స్ సేవలు అందుబాటులోకి వ‌స్తాయి. రేపటిలోగా ఖమ్మం, కరీంనగర్ తో పాటు ఇంకో 5 జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. సమయానికి ఆక్సిజన్ దొరక్క ఇక ఎవరు ఇబ్బందిపడకూడదనే ఆశ‌యంతో చిరంజీవి ఈ మ‌హ‌త్తర కార్యాన్ని మొద‌లు పెట్టారు. అయితే ఇది నేటి నుండి మొద‌లు కానుండ‌డంతో చిరంజీవి సంతోషం వ్య‌క్తం చేస్తూ.. మిష‌న్ మొద‌లైంది. ఇక ఆక్సిజ‌న్ దొర‌క్క చనిపోయార‌నే వార్త‌లు మ‌నం విన‌కూడ‌దు అంటూ చిరు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement