Friday, April 26, 2024

‘మెగా’ ఫ్యామిలీకి బీజేపీ గాలం? అమిత్ షాతో చిరంజీవి, రాంచరణ్ సమావేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధాని ఢిల్లీలో మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవ్వడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓ ఛానెల్ నిర్వహిస్తున్న కాంక్లేవ్‌లో పాల్గొనేందుకు రాంచరణ్ ఆస్కార్ వేదిక నుంచి నేరుగా శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. అదే కార్యక్రమంలో పాల్గొనేందుకు చిరంజీవి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చారు. వారిద్దరితో పాటు అమిత్ షా కూడా  ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విడిగా ముగ్గురూ సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపినట్టు సమాచారం. కాంగ్రెస్‌ హయాంలో రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పని చేసిన చిరంజీవి గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కమలనాథులు చిరంజీవిని తమ వైపు తిప్పుకోవాలని, ఏపీలో ఆయన ప్రచారం చేస్తే బీజేపీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో అల్లూరి విగ్రహావిష్కరణ సందర్భంగా బీజేపీ అగ్రనేతలు చిరంజీవిని పరోక్షంగా ఆహ్వానించారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చిరంజీవి అప్పుడే స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీలో అమిత్ షాతో జరిగిన భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement