Sunday, May 19, 2024

సీఎం కేసీఆర్ ప్ర‌యాణించేందుకు బుల్లెట్ ఫ్రూప్ బ‌స్సు-వైర‌ల్ గా ఫొటోలు

వ‌ర‌ద నీటిలో మునిగిన ములుగు..ఏటూరునాగారం మీదుగా భ‌ద్రాచ‌లం వెళ్లారు సీఎం కేసీఆర్. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌యాణించేందుకు అధికార యంత్రాంగం ఓ బ‌స్సును వినియోగించింది. ఈ బ‌స్సుపై నేష‌న‌ల్ మీడియాలో ఇప్పుడు ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు ప్ర‌సారమ‌వుతున్నాయి.సాధార‌ణంగా సీఎంల ప‌ర్య‌ట‌న కోసం ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు బుల్లెట్ ప్రూఫ్‌తో కూడిన బ‌స్సుల‌ను కొనుగోలు చేస్తున్నాయి. అందులో భాగంగా సీఎం కేసీఆర్ టూర్ కోసం కూడా తెలంగాణ ప్ర‌భుత్వం ఓ బుల్లెట్ ప్రూఫ్ బ‌స్సును కొనుగోలు చేసింది. ఈ బ‌స్సులోనే కేసీఆర్ వ‌రంగ‌ల్ నుంచి భ‌ద్రాచ‌లం వెళ్లారు. రోడ్ల‌పై వర్ష‌పు నీటిలోనే ఈ బ‌స్సు వెళుతుండ‌గా… ఆ బ‌స్సును సీఎం కాన్వాయ్‌లోని కార్లు అనుసరించాయి. ఇప్పుడీ వార్త వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement