Wednesday, May 15, 2024

Chhattisgarh : మరో ఎన్ కౌంటర్.. కాల్పుల్లో మావోయిస్టు మృతి

చ‌త్తీస్‌ఘ‌డ్‌లో వ‌రుస ఎన్‌కౌంట‌ర్‌ల‌తో దండ‌కార‌ణ్యం ద‌ద్ద‌రిల్లుతోంది. తాజాగా మారోసారి కాల్పుల మోత మోగింది. సోమ‌వారం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో సోమవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందగా.. పలువురు జవాన్లు గాయపడ్డారు.

- Advertisement -

ఈఘటన సలాతోంగ్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘటన స్థలం నుండి భద్రతా దళాలు భారీగా పేలుడు పదార్థులు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భద్రతా దళాలు సెర్చ్ అపరేషన్ కంటిన్యూ చేస్తున్నాయి. మృతి చెందిన మావోయిస్టు వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం మరువకముందే తాజాగా మరో ఎన్ కౌంటర్ జరగడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement