Sunday, April 28, 2024

ఆకతాయిల ను ఐసొలేషన్ పంపించిన చెన్నూరు పోలీసులు

కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్న వారి పని పడుతున్నారు తెలంగాణ పోలీసులు. రామగుండం కమిషనరేట్ మంచిర్యాల జిల్లా చెన్నూర్ పోలీసులు ఉదయం 10 గంటల తరువాత రోడ్లపైకి రావద్దంటూ చెప్తున్నా వినకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్న వారి వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నా చాలా మందిలో మార్పు రావడం లేదు.దీంతో కరోనా సోకుతుందని చెప్పినా వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్లపై తిరుగుతున్నారు.

దీనితో వారికి సరైన బుద్ది చెప్పాలని నిర్ణహించి చెన్నూర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అనవసరంగా ఎలాంటి కారణాలు లేకుండా ఆకతాయిగా బయట తిరుగుతున్న 14 మంది ఆకతాయిలను బెల్లంపెల్లి ఐసోలేషన్ కి పంపించారు. 7 బైక్ లను సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement