Tuesday, May 14, 2024

దేవాన్ష్ పుట్టినరోజు.. టీటీడీకి విరాళం

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మనవడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ తనయుడు, నారా దేవాన్ష్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా నారా కుటుంబం తిరుమల నిత్యాన్నదాన కార్యక్రమం కోసం రూ.30 లక్షల విరాళం అందజేశారు. ప్రతియేటా దేవాన్ష్‌ బర్త్‌డే రోజున చంద్రబాబు కుటుంబసభ్యులు విరాళం ఇస్తున్నారు. చెక్కును టీటీడీ అధికారులకు పంపారు.

నారావారి కుటుంబం నిన్ననే తిరుమల విచ్చేసింది.  చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ, వసుంధర తదితరులు ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దేవాన్ష్ పుట్టినరోజును గత నాలుగేళ్లుగా నారా ఫ్యామిలీ తిరుమల శ్రీవారి సన్నిధిలోనే జరుపుకుంటోంది. ప్రతి ఏడాది కూడా ఒక్కరోజు అన్నప్రసాదానికి అయ్యే ఖర్చును నారా కుటుంబ సభ్యులు విరాళంగా అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement