Wednesday, May 1, 2024

జ‌మిలీ ఎన్నిక‌ల‌లో వైసిపి తుడుచిపెట్టుకుపోవ‌డం ఖాయంః చంద్ర‌బాబు

కుప్పం: జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌ద‌వీ కాలం ఇంకా 18 నెల‌లేన‌ని, ఆ త‌ర్వాత జ‌మిలీ ఎన్నిక‌లొస్తాయ‌ని టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు.. జ‌మిలీ ఎన్నిక‌ల‌లో వైసిపి తుడుచిపెట్టుకుపోవ‌డం ఖాయ‌మ‌ని జ్యోస్యం చెప్పారు.. త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో నేడు చంద్ర‌బాబు ప‌ర్య‌టిస్తున్నారు.. మూడు రోజుల పాటు ఈ ప‌ర్య‌ట‌న సాగ‌నుంది.. ఈ సందర్భంగా గుడుపల్లి మండలం కొడతనపల్లి పంచాయితీలో సర్పంచ్‌గా గెలిచిన వెంకటేష్‌ను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ వైసీపీ నేతల దౌర్జన్యాలకు ఎదురొడ్డి విజయం సాధించడం అభినందనీయమన్నారు. పంచాయితీ ఎన్నికలు దౌర్జన్యాలతో జరిపించారని మండిపడ్డారు. తాము బలపరిచిన అభ్యర్థులను అన్ని విధాలా భయపెట్టారని, కుప్పంలో ఏదో సాధించామని విర్రవీగుతున్నారని మండిపడ్డారు. అన్ని గుర్తుపెట్టుకుంటున్నానని, వడ్డీతో కాదు చక్రవడ్డీతో సహా తిరిగిస్తానన్నారు. కుప్పంపై కక్ష కట్టి అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఎవరిని వదిలిపెట్టనని హెచ్చరించారు. తాను అధికారంలో ఉన్న‌ప్పుడు ఇలాగే దౌర్జ‌న్యాల‌కు, అక్ర‌మాల‌కు పాల్ప‌డితే పుంగ‌నూరు నేత అస‌లు ఉండేవారా అంటూ ప్ర‌శ్నించారు.. టీడీపీ నేతలు, కార్యకర్తలు అధైర్య పడవద్దని, అండగా ఉంటానని.. తరచు కుప్పం వచ్చి సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement