Friday, April 26, 2024

సబ్బంహరి మృతి పట్ల చంద్రబాబు, లోకేష్ సంతాపం

టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి మృతి చెందడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. సబ్బం హరి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సబ్బంహరి లేరన్న వార్తను నమ్మలేకపోతున్నానని, ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటారని ఆశించానని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వచ్చిందన్నారు. సబ్బం హరి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. సబ్బం హరి మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. విశాఖ మేయర్‌గా, ఎంపీగా సబ్బం హరి సేవలు మరువలేనివని కొనియాడారు.

అటు సబ్బంహరి లాంటి నేతను కోల్పోవడం దురదృష్టకరమని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. సబ్బంహరి నిస్వార్థ రాజకీయాలతో తమ లాంటి వారికి మార్గదర్శకులుగా నిలిచారని, ఏ విషయంపై అయినా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేవారని, ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేశారని లోకేష్ గుర్తుచేశారు. సబ్బంహరి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement