Friday, April 26, 2024

నల్గొండ 25వ వార్డు ఉప ఎన్నిక‌లో టి ఆర్ ఎస్ విజ‌యం…

న‌ల్లగొండ మున్సిపాలిటీ లోని 26వ వార్డుకు జ‌రిగిన ఉపఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి ఆసిమా సుల్తానా విజ‌యం సాధించారు. ఉప ఎన్నికలో 436 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. 2020లో జరిగిన మున్సిప‌ల్ సాధారణ ఎన్నికల్లో 26వ వార్డు నుంచి గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి దుబ్బాక కాంతమ్మ నెల రోజులకే మృతి చెందారు. దీంతో ఈ వార్డుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్‌ఎస్‌ నుంచి ఆసిమా సుల్తానా, బీజేపీ నుంచి దాసరి మహేశ్వరి, ఎంఐఎం నుంచి గౌసీయాబేగం, కాంగ్రెస్‌ నుంచి దుబ్బ రవళి ఎన్నిక‌ల బరిలో పోటీప‌డ్డారు. ఉపఎన్నిక‌లో విజ‌యం ఆసిమా సుల్తానాను వ‌రించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement