Thursday, May 2, 2024

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

అంతర్జాతీయ విమానాల‌పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మ‌రో 30 రోజులు పొడిగించింది. అంత‌ర్జాతీయ‌ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని మ‌రో నెల‌పాటు పొడిగిస్తున్న‌ట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్ల‌డించింది. జూన్ 30వ తేదీ వరకు ఈ నిషేధం అమ‌ల్లో ఉంటుంద‌ని డీజీసీఏ శుక్రవారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అయితే, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు.

కరోనా కారణంగా గత ఏడాది జూన్ 30 నుంచి అన్ని అంతర్జాతీయ క‌మ‌ర్షియ‌ల్‌, ప్యాసింజర్ విమానాలపై నిషేధం అమల్లో ఉన్న‌ది. అయినప్పటికీ ప్యాసింజర్ల రాకపోకలకు అవరోధం లేకుండా పలు దేశాలతో ఇండియా చేసుకున్న ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం పలు అంతర్జాతీయ విమానాల ఆపరేషన్ జరుగుతున్న‌ది. అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో భార‌త్‌ ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement