Monday, April 29, 2024

చిన్నారిని చిత్రహింస‌ల‌కి గురి చేసిన కేర్ టేక‌ర్ – సీసీ కెమెరాతో గుట్టు ర‌ట్టు

త‌ల్లిదండ్రులు ఇద్ద‌రు ఉద్యోగ‌స్తులు కావ‌డంతో ఆ చిన్నారి బాబుని చూసుకోవ‌డానికి కేర్ టేక‌ర్ ని ఇంట్లోనే ఏర్పాటు చేశారు. కాగా ఆ బాబు రోజు రోజుకి బ‌ల‌హీన‌ప‌డుతుండ‌టంతో డాక్ట‌ర్ కి చూపించ‌గా చిన్నారిని చిత్ర‌హింస‌ల‌కి గురి చేసిన‌ట్టు తేలింది. దాంతో ఇంట్లో సీక్రెట్ కెమెరాలు అమ‌ర్చాలు ఆ త‌ల్లిదండ్రులు. దాంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆ కేర్ టేక‌ర్ చిన్నారిని చిత్ర‌హింస‌లు పెట్ట‌డం కెమెరాలో రికార్డు అవ్వ‌డంతో ఆశ్చ‌ర్య‌పోయారు త‌ల్లిదండ్రులు. ఈ సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని జబల్‌పూర్‌లో చోటు చేసుకుంది. రజినీ చౌదరిగా గుర్తించబడిన కేర్ టేక‌ర్ కి నెలవారీ రూ. 5,000 ఇచ్చి.. బాబును చూసుకోవడానికి నియమించుకున్నారు. జీతంతో పాటు ఆమెకు భోజనం కూడా పెడుతున్నారు. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లిన తర్వాత బిడ్డను చూసుకునే బాధ్యత ఆమెకు అప్పగించారు. అయితే, ఇప్పుడు ఆమె చేసిన పని అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో వెంటనే వారు ఆమె మీద పోలీస్ కంప్టైంట్ ఇచ్చారు.

తమ చిన్నారి ఆరోగ్యం పాడవ్వడం గురించి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకోసం బైటికి వెడుతూ.. నమ్మి తమ కలలపంటను వారి చేతుల్లో పెడితే.. వారు చేసే ఘోరాలకు పిల్లల భవిష్యత్తే ప్రశ్నార్థకంలో పడుతోంది. రెండేళ్ల చిన్నారి మీద ఇంత దారుణానికి పాల్పడ‌టం శోచ‌నీయం..ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో.. చిన్నారిని నానీ కొట్టడం, జుట్టు పట్టుకుని లాక్కెళ్లడం.. ఈడ్చి చెంపల మీద కొట్టడం, ఇష్టానుసారంగా బాదడం.. మొరటుగా వ్యవహరించడం కనిపిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియో చెబుతోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్స్.

https://twitter.com/diginewswoman/status/1536975123747639297
Advertisement

తాజా వార్తలు

Advertisement