వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. బెయిల్ రద్దు పిటిషన్పై విచారణలో భాగంగా ఆయనకు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి, సీబీఐ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 10న విజయ సాయిరెడ్డి బెయిల్ పిటిషన్పై సీబీఐ కోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది.
కాగా విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారని పిటిషన్లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. అయితే దీనిపై శనివారం విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. కాగా సీబీఐ కోర్టు తీర్పుపై విజయసాయిరెడ్డి స్పందించాల్సి ఉంది.
ఈ వార్త కూడా చదవండి: అలీషా కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేతలు