Sunday, May 5, 2024

ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా.. కొత్తగా 1,908 మందికి పాజిటివ్

ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 80,376 మంది సాంపిల్స్ పరీక్షించగా.. 1908 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనాతో 23 మంది మృతి చెందగా.. 2,103 మంది పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. కోవిడ్ కారణంగా కృష్ణా జిల్లాలో నలుగు, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. అనంతపూర్, తూర్పు గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఇద్దురు చొప్పున.. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.  ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,80,258 చేరింది. మొత్తం 19,46,370 మంది మహ్మమారి నుంచి కోలుకుకోగా.. 13513 మంది మరణించారు.

ఇది కూడా చదవండిః త్వరలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ.. దళిత వర్గానికి డిప్యూటీ సీఎం పదవి!

Advertisement

తాజా వార్తలు

Advertisement