Friday, May 17, 2024

అఖిలేష్ సతీమణికి కరోనా పాజిటివ్..

సమాజ్ వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ కు కరోనా సోకింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికి తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని ఆమె ట్విట్టర్ లో తెలిపారు. ప్రస్తుతం హోమ్ అసోలేషన్లో ఉన్నానని, అయితే ఎటువంటి లక్షణాలు కన్పించడం లేదని తెలిపారు. ఇటీవలి కాలంలో తనను కలసినవారంతా వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు.

మాజీ ముఖ్యమంత్రి ములాయం వ్యాక్సిన్ తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయగా బీజేపీ వ్యాక్సిన్ ను తాను తీసుకోబోనని గతంలో అఖిలేష్ ప్రకటించారు. ఇప్పుడు తీవ్ర విమర్శలు రేగిన నేపథ్యంలో వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పుడు సతీమణికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఎలా స్పందిస్తారో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement