Friday, May 17, 2024

లారీని ఢీ కొన్న కారు – ముగ్గురు మృతి-ప‌లువురికి గాయాలు

వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుత‌ప్ప లారీని ఢీ కొంది.ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. కాగా ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదం వికారాబాద్‌ జిల్లా పూడూరులో ఉన్న స్టీల్‌ ఫ్యాక్టరీ వద్ద చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులను జహిరాబీ (68), జావెద్‌ (12), ఉమర్‌ (6)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement