Sunday, April 28, 2024

బీఎండబ్ల్యూ కారులో నుంచి మంటలు…

హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఘోరం జరిగింది. పీవీ న‌ర‌సింహారావు ఎక్స్‌ప్రెస్ వే 202 పిల్ల‌ర్ వ‌ద్ద నిలిపి ఉంచిన బీఎండ‌బ్ల్యూ కారులో ఆక‌స్మాత్తుగా అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. ఆ సమయంలో కారు ప్రయణిస్తున్న ముగ్గురు కారును పక్కకు ఆపి బయటకు వచ్చారు. దీంతో తృటిలో ప్రమాదం తప్పినట్లయింది. ఘటనతో భ‌య‌ప‌డ్డ స్థానికులు దూరంగా ప‌రుగెత్తారు. దీంతో పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అనంతరం స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: ధోనీ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement