Friday, May 3, 2024

Krishna : కారు బీభత్సం.. ఒక‌రు మృతి

కారు బీభత్సం సృష్టించడంతో ఒక‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వీరవల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్‌ నుంచి కొవ్వూరు వైపు వెళ్తున్న కారు బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద డివైడర్‌ను దాటి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో కేరళకు చెందిన థామస్‌ (60) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. రెండు కార్లు ధ్వంసమయ్యాయి.సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement